రంగారెడ్డిః జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొత్తూరు మండల కేంద్రంలోని విజయలక్ష్మీచౌరస్తా వద్ద శనివారం మధ్యహ్నం లారీ, బైకు ఢీకొని భార్యభర్తలు ఇద్దరూ మృతి చెందారు. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫరుక్నగర్ మండల కేంద్రానికి చెందిన చాపల అంజనేయులు 50 సంవత్సరాలు, భార్య కళావతి 45 సంవత్సరాలు కొత్తూర్ మండలంలోని గూడూర్ గ్రామానికి కూతురు దగ్గరకు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరుగూ ప్రయాణంలో మండల కేంద్రంలోని విజయలక్ష్మీ చౌరస్తా వద్ద బైకు అదుపుతప్పి భార్యభర్తలు ఇద్దరూ కిందపడటంతో వెనకాల నుండి వచ్చిన లారీ వారిపై నుండి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతురు అనుష పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీధర్ భూపాల్ తెలిపారు.
Couple dead in Road Accident in Rangareddy