Sunday, May 11, 2025

జన్వాడలో దారుణ ఘటన.. భార్య గొంతుకోసి..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలోని శంకర్ పల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం మండలంలోని జన్వాడలో నాగరాజు(40) అనే వ్యక్తి తన సుజాత(35) భార్య గొంతుకోసి హత్యచేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు ఆర్ఎంపి వైద్యుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News