Sunday, February 23, 2025

దంపతుల అనుమానాస్పద మృతి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దంపతులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం నరెల పోలీస్ స్టేషన్ పరిధిలో స్వతంత్ర నగర్ లోని తమ ఇంట్లో దంపతుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. భార్యను హత్యచేసి అనంతరం భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News