Friday, July 5, 2024

కవితకు బిగ్ షాక్.. జూలై 3వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత రిమాండ్ సోమవారంతో ముగిసింది. దీంతో తీహార్ జైలు అధికారులు. కవితను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు.

ఈడీ అధికారులు వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. కాగా, లిక్కర్ కేసులో మార్చి 15న ఈడి అధికారులు కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సీబిఐ అరెస్ట్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News