- Advertisement -
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూడకుండా నేరుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 4 గంటల సమయం పడుతుంది. ఇక, ఆదివారం శ్రీవారిని 72,960 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -