Monday, April 7, 2025

ఉపాధి పథకంలో డ్రాగన్ ఫ్రూట్స్ పెంపకం

- Advertisement -
- Advertisement -

వడ్డేపల్లి : 2023,24 సంవత్సరంలో ఉపాధి పథకంలో డ్రాగన్ ఫ్రూ ట్స్ తోటల పెంపకానికి ప్రభుత్వం అనుమతించిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. రవీంద్ర బుధవారం నిర్వహించిన సమావేశంలో తెలిపారు. ఈ పథకంలో చిన్న,సన్న కారు రైతులు కుటుంబం మొత్తానికి కలిపి అర్థ ఎకరా నుం చి ఐదు ఎకరాల పొలం ఉండాలని, అటువంటి వారికి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తోటల పెంపకం మంజూరు చేయబడునని తెలిపారు.

మంజూరైన వారికి మూడు సంవత్సరాల వరకు ఉపాధి పథకంలో ఫర్టిలైజర్, మొక్కల కొనుగోలుకు, ఇతర సామగ్రి కొనుగోలుకు ఉపాధి హామీ పథకంలో రేట్ల ప్రకారం వారికి చెల్లించడం జరుగుతుందని, మండలంలోని చిన్న, సన్న కారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ విజయ లలిత, పంచాయతి కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ రాఘవేంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News