Friday, October 18, 2024

చీల్చితే సిఎం పదవి

- Advertisement -
- Advertisement -

బిజెపి నేతలు కబురు
పెట్టారని సంచలన
వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ
డిప్యూటీ సిఎం సిసోడియా

ఢిల్లీ : నూతన మద్యం విధానంలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సం స్థల విచారణను ఎదుర్కొంటోన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఓ కీలక విషయం వెల్లడించారు. బిజె పి నుంచి తనకు ఓ సం దేశం వచ్చిందని , తనపై ఉన్న కేసు ల్ని మూసివేసేందుకు ఆప్‌ను వదిలి బీజేపీలో చే రాలని కోరుతూ ఆ సం దేశం పంపారని పేర్కొన్నారు. పార్టీని చీల్చి వస్తే సిఎం పదవి ఇస్తామని కూడా చెప్పా రని తెలిపారు. కానీ తానొక రాజ్‌పుత్రను, మహా రాణాప్రతాప్ వారసుడిని. నేను నా తలనైనా నరుక్కుంటా ను కానీ అవినీతి కుట్రదారుల ముం దు మాత్రం తలవంచను. నాపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. నాకొచ్చిన సందేశానికి ఇదే నా సమాధానం అంటూ మనీశ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ తనపై లుకౌట్ సర్కులర్ (ఎల్‌వోసీ)జారీ చేసిందని సిసోడియా చెప్పారు. తాను దేశం విడిచి వెళ్లకుండా చూడడానికి ఈ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. అయితే మద్యం కుంభకోణంలో ఎఫ్‌ఐఆర్‌లో పేరున్న ఎనిమిది మందిపై ఎల్‌వోసీ జారీ చేసినట్టు సిబిఐ తెలిపింది.

సిసోడియా సహా నలుగురు ప్రజా ప్రతినిధులపై మాత్రం ఇవి జారీ కాలేదని స్పష్టం చేసింది. ఢిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్ర భుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆ బ్కారీ విధానంలో అనేక అవకతవక లు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతోపాటు విధానపరమైన లోపాలున్నట్టు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి అయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కు సిఫార్సు చేశారు. దాంతో మనీశ్ , పలువురు మాజీ అధికారుల ఇళ్లు , ప్రాంగణాలపై సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News