Tuesday, September 17, 2024

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్లు తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

మద్యం విధానం కుంభకోణంలో సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు బెయిల్ పిటిషన్‌ను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. సరైన కారణం లేకుండా అరెస్ట్ జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వం లోని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తునూ కొట్టివేసింది.

అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మొదట కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈ ఏడాది మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఊరట లభించినప్పటికీ, మద్యం విధానంలో అక్రమాలపై సిబిఐ కేసు నమోదు చేసింది. తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే మనీలాండరింగ్ కేసులో సుప్రీం కోర్టు జులై 12న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే సిబిఐ కేసు కారణంగా ప్రస్తుతం కేజ్రీవాల్ జైలులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News