- Advertisement -
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో ఐపిఎల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 206 పరగులు లక్ష్యాన్ని ముంబయి ఉంచింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 40 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ముంబయి ఇండియన్స్ బ్యాట్స్మెన్లలో తిలక్ వర్మ(59), రికెల్టన్(41), సూర్యకుమార్ యాదవ్(40), నమన్ ధిర్(38 నాటౌట్), రోహిత్ శర్మ(18), హర్ధిక్ పాండ్యా(02), విల్ జాక్స్(01 నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీలో బౌలర్లలోమ విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా ముకేశ్ కుమార్ ఒక వికెట్ తీశాడు.
- Advertisement -