Tuesday, September 17, 2024

మా జన్మ ధన్యం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆగస్టు నెలలోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని, రెండు లక్షల రుణ భారం తీరటంతో నిజమైన స్వేచ్ఛను పొందారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ జులై, ఆగస్ట్ నెలలు దేశ చరిత్రలోనే లిఖించదగ్గ నెలలని అభివర్ణించారు. కేవలం 12 రో జుల్లోనే రూ.12 వేల కోట్ల రుణం మాఫీ చేసి న ఘనత తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి అద్దం పట్టిందన్నారు. రైతుల సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరని, తమ ప్రభుత్వ ప్రణాళికలను ఎవరూ ప్రశ్నించలేరంటూ సవాలు విసిరారు. ఏకకాలంలో రూ.31 వేల కోట్లు కేటాయించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని అన్నా రు. స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రా ష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని అన్నారు. సాధారణంగా ఎ న్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీల నేతలకు రై తులు గుర్తుకు వస్తారని సీఎం అన్నారు. కానీ ఇప్పుడేం ఎన్నికల్లేవని, ఓట్లు లేవని..రాజకీ య ప్రయోజనాలు కాదు..

తమకు రైతుల ప్ర యోజనాలే ముఖ్యమని సిఎం స్పష్టం చే శా రు.అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండ గా.. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగ ణం నుంచే రైతు రుణమాఫీ రెండవ విడుత నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలందరి సమక్షంలో పలువురు రైతులకు చెక్కులు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు.ఇదే వేదిక నుంచి రెండో విడతగా రాష్ట్రంలో లక్షన్నర లోపు పంట రుణాలున్న రైతులందరి రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మొత్తం 6.40 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.6198 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. రుణవిముక్తి పొందిన లక్షలాది రైతులు తమ ఇండ్లలో పండుగ చేసుకుంటుంటే తమ జన్మ ధన్యమైందని అన్నారు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా జులై 18న తొలి విడతగా లక్ష రూపాయల లోపు రుణాలున్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 11 లక్షల మంది రైతులకు రూ.6098 కోట్లు మాఫీ చేసింది. పన్నెండు రోజుల వ్యవధిలోనే రెండో విడతగా మరో రూ.6198 కోట్లు విడుదల చేసింది.

అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఈ వేడుకలో పాలుపంచుకున్న నేతలందరికీ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తామని 2022 మే 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిందని సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులు సంతోషంగా ఉండాలని అధికారంలో చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రైతు రుణమాఫీ అమలు చేశామని చెప్పారు. దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని, దివాళా తీసినట్లు మోసం చేశాయని అన్నారు. గడిచిన పదేండ్లలో బ్యాంకులకు దాదాపు రూ. 14 లక్షల కోట్లు ఎగవేశాయని అన్నారు. పది మందికి అన్నం పెట్టే రైతులు మాత్రం పంట దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆత్మ గౌరవం దెబ్బతిని కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే రైతుల కుటుంబాల్లో విషాదం ఉండకుండా ఆనందం నింపాలని రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ.లక్ష రైతు రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేక పోయిందని, మొదటి సారి అధికారంలో ఉన్నపుడు నాలుగు విడతల్లో మాఫీ చేస్తే.. రైతులు తమ అప్పుకు మించి మిత్తీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. రెండో సారి అదే హామీతో అధికారంలో వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.19 వేల కోట్లు ఇస్తామని చెప్పి, రూ.12 వేల కోట్లు విడుదల చేసిందని అన్నారు. దాదాపు రూ.7 వేల కోట్లు రైతులకు రుణ మాఫీ చేయకుండా ఎగవేసిందని అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు తమను అవహేళన చేశారని అన్నారు. శాపనార్ధాలు పెట్టారని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ నెలలోగా రుణమాఫీకి ప్రణాళిక ప్రకారం నిధులను సమీకరించిందని చెప్పారు. ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఆగస్టు15లోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వంలో రూ.7లక్షల కోట్లకు తెలంగాణ తాకట్టు
గత ప్రభుత్వం అప్పుల పాల్జేసి తెలంగాణను తాకట్టు పెట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి, రుణాల భారం తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు తమ ప్రభుత్వం ఈ ఎనిమిది నెలల్లో రూ.43 వేల కోట్లు కిస్తీలు చెల్లించిందని చెప్పారు. ఉద్యోగులకు ప్రతినెల రూ.5వేలకోట్లు జీతాలు చెల్లిస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎక్కడా నిధుల కొరత రానీయకుండా ఆర్ధిక శాఖ నిధులు సమూకూరుస్తోందని అభినందించారు. కేవలం 12 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.12 వేల కోట్లకుపైగా నిధులు జమ చేసిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు అధికారుల బృందానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

రుణమాఫీకే పరిమితం కాము : భట్టి
తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని , వ్యవసాయరంగంలో కేవలం పంటరుణాల మాఫీకే పరిమితం కావటం లేదని , రైతుభరోసా, పంటల బీమా పథకాలుకూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసితీరుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు.సిఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రుణమాఫీ నిధుల విడుదలకు ముందు భట్టి మాట్లాడు -ప్రజల మేలుకోసం ఈ ప్రభుత్వం ఎంతగా తపిస్తుందో చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక ఉదాహరణ అని,ఈరోజు పండుగ దినం రైతుల గుండెల పై ఉన్న పెద్ద భారం తొలగిపోతుందన్నారు.ఆగస్టు చివరకల్లా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయబోతున్నామని, రుణమాఫీ కే పరిమితం కామని, రైతు బీమా ప్రీమియం డబ్బులను రైతుల పక్షాన ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు.గత ప్రభుత్వం పదేళ్లుగా గాలికి వదిలేసిన పంటల బీమా పథకాన్ని తాము అమలు చేయబోతున్నామన్నారు.ఈ ఏడాది జూలై 15న రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి కేవలం మూడు రోజుల్లో మొదటి విడత జూలై 18న 11.50 లక్షల మందికి 6,098.93 కోట్ల పంపిణీ చేశామని వెల్లడించారు. 2వ దఫా కింద ఇదే జూలై మాసంలో 6,190 కోట్లు 5,45, 407 వ్యవసాయ కుటుంబాలకు రుణమాఫీ అందిస్తాం చేస్తున్నామని ప్రకటించారు.

రెండు దశల్లో 17.91 అకౌంట్లకు 16.29 లక్షల కుటుంబాలకు 12,289 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.ఈ సభలో సీఎం ఒక రైతుకు చెక్ అందచేయగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరి ఖాతాలో రుణమాఫీ నిధులు జమ చేస్తున్నామని వెల్లడించారు.సీఎం రేవంత్ రెడ్డి నాడు పిసిసి అధ్యక్షుడు గా తాను సీఎల్పీ నేత గా మా నాయకుడు రాహుల్ గాంధీతో హెలికాప్టర్ లో వెళుతు 2లక్షల రుణమాఫీ గురించి చర్చించి వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటిస్తే ఇది సాధ్యమా? అని అంతా ఆశ్చర్యపోయారని , నాటి అధికార పార్టీ హేళన చేసిన విషయాన్ని వివరించారు .మొదటి సారి లక్ష రుణమాఫీ ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఒకే సారి లక్ష రూపాయలు మాఫీ చేయలేక 4 దఫాలు గా చేస్తే వడ్డీ భారం పెరిగి రైతు ప్రయోజనం పొందలేక పోయాడన్నారు. 2వ సారి చేస్తామని ప్రకటించి ఎన్నికల ముందు అరకొరగా చేసి గత ప్రభుత్వం చేతులు దులుపుకొందన్నారు. ధనిక రాష్ట్రంగా అప్పగిస్తేనే రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా అని అందరు ఆశ్చర్యపోయారన్నారు. తమకు సంకల్పబలం ఉంది ఆ సంకల్ప బలాన్ని నిజం చేస్తూ పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు చివరిలోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు.

కేవలం రుణమాఫీతో పరిమితం కాలేదని, రైతు బీమా కింద 42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1580 కోట్ల ప్రీమియంను రైతుల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు.పంటల బీమా పథకాన్ని గత ప్రభుత్వం పదేళ్లపాటు గాలికి వదిలేసింది.. కానీ మేము అలా చేయదలచుకోలేదన్నారు. పంటల బీమా కింద రూ.1350 కోట్లు ప్రభుత్వమే చెల్లించబోతుందని తెలిపారు. ఒకే అకౌంట్ ద్వారా రాష్ట్రంలోని బ్యాంకులకు 31 వేల కోట్లు రైతు రుణమాఫీ కింద ప్రభుత్వం నుంచి జమ అవుతున్నాయని, దేశ చరిత్రలో, బ్యాంకింగ్ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం బ్యాంకుల్లో జమ కావడం విశేషం అన్నారు. బ్యాంకర్లు విశాల హృదయంతో రైతులకు సహకరించి వెనువెంటనే రుణాలు ఇవ్వాలని కోరారు. ఇంతటి బృహత్కర కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ కి, సీఎం రేవంత్ రెడ్డికి సహచర మంత్రులకు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు.

రైతుభరోసాకు త్వరలో మార్గదర్శకాలు:తుమ్మల
రైతుభరోసా పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు సిద్దమవుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించార. ఉభయసభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.గతంలోకంటే భిన్నంగా రైతుభరోసా విధివిధానాలు ఉంటాయని వెల్లడించారు. ఎకరానికి రూ.15వేలు ఇచ్చితీరుతామన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామన్నారు. ఒకే పంటకాలంలో రూ.31వేలకోట్లు రుణమాఫీ చేస్తున్నామన్నారు. పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగు చేయాలన్నారు. ఐదేళ్లలో 5లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేయాలని కోరారు. దేశమంతటికీ పామాయిల్ సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలన్నదే తమ లక్షం అన్నారు. నీటిపారుదల శాఖ కూడా సాగునీటి పథకాల పనులు సత్వరమే పూర్తి చేసేందకు కృషి చేస్తోందన్నారు. వ్యవసాయరంగంలో సంక్షేమ పథకాలు అమలు ద్వారా రైతును రాజును చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News