Tuesday, April 29, 2025

తిరుమలలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచివున్నారు. గురువారం 56,049 మంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 26,748 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News