Sunday, February 23, 2025

తిరుమలలో భారీగా రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటలు

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శుక్రవారం 71,664 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,330 మంది భక్తులు నిన్న వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న రూ. 3.37 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News