Tuesday, February 4, 2025

ఐటి కార్యాలయానికి చేరుకున్న దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎఫ్ డిసి చైర్మైన్, నిర్మాత దిల్ రాజు ఐటి కార్యాలయానికి వెళ్లారు. గత వారం దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజుల పాటు ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకరావాలని దిల్ రాజుకు నోటీసులు పంపారు. సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటి అధికారుల ఆరా తీశారు. జనవరి 21న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటి సోదాలు అనేది కామన్‌.. అకౌంట్‌ బుక్స్‌ చెక్‌ చేసి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారని, మా ఇంట్లో రూ.20 లక్షల లోపే డబ్బులు ఉన్నాయని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో తెలిపిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News