Sunday, February 23, 2025

నాపై ఉన్న రైల్ రోకో కేసును కొట్టివేయండి..హైకోర్టులో కెసిఆర్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

పదమూడేళ్ల క్రితం రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కెసిఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు పెట్టారని అందులో పేర్కొన్నారు. తనను 15వ నిందితుడిగా చేర్చారన్నారు. తాను రైల్ రోకోలో పాల్గొనలేదని వెల్లడించారు. కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో వెల్లడించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News