Sunday, March 9, 2025

విప్ ను ధిక్కరించిన వారిని అనర్హులుగా ప్రకటించాలి: రోజా

- Advertisement -
- Advertisement -

అమరావతి: మేయర్ శిరీషను విధుల నిర్వహణలో అవమానించారని ఎపి మాజీ మంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్య ఓటమని తెలిపారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు… గురుమూర్తి ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఓటు ఉన్న టిడిపి అభ్యర్థి ఎలా గెలుస్తాడని రోజా ప్రశ్నించారు. విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికలకు వైఎస్ఆర్ పి విప్ జారీ చేసిందని మాజీ మంత్రి ఆర్ కె రోజా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News