- Advertisement -
ఒరిజినల్ పత్రాలతో అభ్యర్దులు హాజరుకావాలని వెల్లడి
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో బస్తీ దవాఖానల్లో విధులు నిర్వహించుటకు వైద్యాధికారుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులు నియమాకాల కోసం రేపు అర్హత దృవీకరణ పత్రాలతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి రావాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. సోమవారం వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ ఈనెల 12 మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటలకు వరకు ,బుధవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు హరిహరకళాభవన్ సికింద్రాబాద్లో ఉన్న కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా వెల్లడించారు.
- Advertisement -