Tuesday, September 17, 2024

ప్రభుత్వాస్పత్రిలో శవాన్ని పీక్కుతిన్న కుక్క

- Advertisement -
- Advertisement -

Dog eat women dead body in Uttar Pradesh

లక్నో: ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్ జిల్లా ఆస్పత్రిలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ యువతి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సదరు యువతి చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తెల్లబట్టలో చుట్టి స్ట్రేచర్‌పై పెట్టి సిబ్బంది వెళ్లిపోయారు. వీధి కుక్క అక్కడికి వచ్చి శవాన్ని పీక్కుతింటుండగా వీడియో తీశారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే తన కూతురు కన్ను మూసిందని మృతురాలు తండ్రి చరణ్ సింగ్ ఆరోపణలు చేశాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కూతురును ఆస్పత్రి తీసుకొచ్చిన గంటన్నర సేపు వరకు వైద్యులు స్పందించలేదని మండిపడ్డారు. సరైన సమయంలో వైద్యులు స్పందించి ఉంటే తన కూతురు బతికేదని పేర్కొన్నారు. ఆస్పత్రి సూరిండిండెంట్ మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో వీధి కుక్కల స్వైర విహారం గురించి మున్సిపల్ అధికారులకు సమాచార ఇచ్చామని, వారు పట్టించుకోలేదన్నారు. యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, తమ తప్పులేదన్నారు. స్వీపర్, వార్డుబాయ్ నిర్లక్ష్యం కారణంగా వీధి కుక్కలు శవం దగ్గరికి వచ్చాయని, వారిపై చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. యోగి ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News