Sunday, September 8, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

- Advertisement -
- Advertisement -

ముంబై:  వివిధ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా చివరి దశ పోలింగ్‌కు ముందు గురువారం భారత ప్రధాన సూచీలు పతనమయ్యాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్ పైరీ రోజైన నేడు నిఫ్టీ కీలక 21 డే ఈఎంఏ మద్దతు రేఖను ఛేదించింది.

బిఎస్ఈ  సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లేదా 1% స్లైడింగ్ 73,668.73 వద్ద రోజు యొక్క కనిష్ట స్థాయిని తాకగా, విస్తృత నిఫ్టీ 250 పాయింట్లు లేదా 1% కరెక్ట్ చేస్తూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 22,459.15 ను తాకింది.

సెన్సెక్స్ 617.30 దిగువన 73,885.60 వద్ద ముగియగా, 50 స్టాక్స్ నిఫ్టీ 216.05 పాయింట్ల నష్టంతో 22,488.65 వద్ద స్థిరపడింది. గురువారం సెషన్‌లో వరుసగా ఐదో రోజు క్షీణత నమోదైంది.

నేడు లాభపడ్డ షేర్లలో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, ఎస్ బిఐ షేర్లు ఉండగా, నష్టపోయిన షేర్లలో టాటా స్టీల్, టెక్ మహీంద్ర, పవర్ గ్రిడ్, టైటాన్ కంపెనీ షేర్లు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News