Tuesday, April 8, 2025

టిటిడి పథకాలకు రూ.కోటి విరాళం

- Advertisement -
- Advertisement -

తిరుమల మన తెలంగాణ ప్రతినిధి: టిటిడి నిర్వహిస్తున్న వివిధ పథకాలకు సోమవారం రూ.కోటి విరాళంగా అందింది. ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకులు మండపంలో టిటిడి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి వై.రాఘవేంద్ర విశ్వకర్మ విరాళం డీడీలను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News