Thursday, September 19, 2024

‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సార్ పూర్తి

- Advertisement -
- Advertisement -

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ పొందింది. డబుల్ ఇస్మార్ట్ ఏ సర్టిఫికేట్ ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, కమర్షియల్ అట్రాక్షన్స్‌ని హైలైట్ చేస్తుంది. 2 గంటల 42 నిమిషాల రన్ టైం గల ఈ మూవీ డైనమిక్, గ్రిప్పింగ్ నెరేటివ్‌తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించనుంది.

ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్ట్ హాఫ్‌లో ది బెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచేలా చేయనుంది. క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీ, మెమరబుల్‌గా ఉండబోతోంది. హీరో హీరోయిన్లు రామ్, కావ్య థాపర్ మధ్య రొమాంటిక్ ట్రాక్ యూత్ అండ్ ఆడియన్స్‌ను ఆకర్షించేలా సెట్ చేయబడింది. పూరి కనెక్ట్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News