మహబూబాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా విజృంభణ కోనసాగుతోంది. ఈ మమమ్మారిని కట్టడి చేసే యత్నంలో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు పోలీసులు. తాజాగా డీఎస్పీ శశిధర్ కరోనాతో మృతి చెందాడు. ప్రస్తుతం ఈయన మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. డీఎస్పీ శశిధర్మృతిపట్ల జిల్లా పోలీసు అధికారులు, మంత్రి సత్యవతి రాఠోడ్, జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులు ఇప్పటికే 80వేలు దాటాయి.
DSP Shashidhar Dies With Coronavirus
- Advertisement -