Wednesday, October 16, 2024

ఎపి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో 23 కోట్ల ఆస్తులు ఇడి అటాచ్

- Advertisement -
- Advertisement -

ఎపిలో గత వైసిపి ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై ఇడి నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మంగళవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ కేసులో గతంలో చంద్రబాబు అరెస్టు తర్వాత ఇడి పలు చర్యలు తీసుకుంది. అయితే ఇదే కేసులో చంద్రబాబుకు బెయిల్ లభించడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జరిగాక ఇడి చర్యలు కూడా తగ్గిపోయాయి. అయితే తాజాగా మరోసారి ఇడి కొరడా ఝళిపించింది. ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అక్రమాల కేసులో హైదరాబాద్ ఇడి కార్యాలయం మంగళవారం రూ.23.54 కోట్ల మేర చర, స్ధిరాస్తుల్ని అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.

ఏపీఎస్‌ఎస్డీసీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇడి ఆ ప్రకటనలో తెలిపింది. ఎపిలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించిందని ఇడి పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌లో సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఎపి ప్రభుత్వం విడుదల చేసిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇడి దర్యాప్తు చేస్తోందని ఇందులో వెల్లడించింది. ఇడి దర్యాప్తులో డిజైన్ టెక్ సంస్థ ఎండి ఖాన్వేల్కర్ , సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ బోగస్ ఇన్ వాయిస్ లు సృష్టించి ప్రభుత్వ నిధుల్ని తమ షెల్ కంపెనీలలోకి మళ్లించినట్లు ఇడి గుర్తించినట్లు తెలిపింది. కాబట్టి వీరికి చెందిన స్దిరచరాస్తులు అటాచ్ చేసినట్లు ఇడి తెలిపింది. అలాగే గతంలో డిజైన్ టెక్ సంస్ధకు చెందిన రూ.31.20 కోట్లను కూడా అటాచ్ చేసినట్లు వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News