Saturday, July 6, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ మహిపాల్ బ్యాంకు లాకర్లలో బినామీల పేరుతో డాక్యుమెంట్లు

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్ రెడ్డిపై ఇడి కేసు విచారణ ముమ్మరం చేసింది. మంగళవారం మహిపాల్ రెడ్డిని విచారించిన ఇడి అధికారులు బుధవారం మహిపాల్ రెడ్డి బ్యాంక్ అకౌంట్లపై దృష్టి పెట్టారు. పటాన్ చెరులోని యాక్సిస్ బ్యాంక్ లో మహిపాల్ రెడ్డి బ్యాంకు లాకర్లను ఇడి అధికారులు ఓపెన్ చేసి, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బినామీల పేర్లతో ఉన్న పలు పత్రాలు లాకర్లలో ఉన్నట్లు గుర్తించిన ఇడి అధికారులు మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీలకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరో వైపు మహిపాల్ రెడ్డికి బినామీలుగా ఉన్నవారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమా చారం.

కాగా గత నెల 20న మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో ఇడి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణకు రావాల్సిందిగా ఎంఎల్‌ఎకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఇడి కార్యాలయంలో విచారణకు హాజరు కాగా ఆ మరుసటి రోజే బ్యాంకు లావాదేవీలు, లాకర్లపై ఇడి దృష్టి సారిం చడం సంచలనంగా మారింది. అయితే పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహి స్తున్నారు. బినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్ల వరకు నష్టం వాటిల్లేలా చేశారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News