Thursday, September 19, 2024

లగ్జరీ కార్లలో రయ్.. రయ్

- Advertisement -
- Advertisement -

ED officials said Partha Chatterjee gifted cars

పార్థ చటర్జీ, అర్పిత జాయ్ రైడ్‌లు : ఈడీ వర్గాల వెల్లడి

కోల్‌కతా : టీచర్ల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన అయిదు బ్యాంకు ఖాతాలను జప్తు చేసే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు శనివారం చెప్పారు. ఈ బ్యాంకు ఖాతాల్లో రూ2 కోట్లకు పైగా నగదును ఇడి అధికారులు గుర్తించినట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా అర్పితా ముఖర్జీ నిర్వహిసున్నట్లుగా భావిస్తున్న పలు షెల్ కంపెనీలకు చెందిన బ్యాంకు అకౌంట్లు కూడా ఇడి దృష్టిలో ఉన్నట్లు, అయితే ఈ షెల్ కంపెనీల్లో ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టారో మాత్రం ఆయన వెల్లడించలేదు. సంబంధిత అధికారలునుంచి ఈ ఖాతాల వివరాలను కోరామని, అవి అందిన తర్వాత తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని ఆ అధికారి చెప్పారు.

ఇదిలా ఉండగా ముఖర్జీకి చెందిన కనిపించకుండా పోయిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిని ఇడి మొదలు పెట్టి ందని అఅధికారి తెలిపారు. ఈ కార్లలో రెండు కార్లు ఒకటి మెర్సిడెజ్ బెంజ్, మరోటి మినీ కూపర్ మంత్రి, అర్పితా ముఖ ర్జీ తరచూ జాయ్ రైడ్స్‌కు ఉపయోగించే వారని, కార్లలోనే అర్పి త పార్టీలు కూడా చేసుకునే వారని ఆయన తెలిపారు. అర్పిత కారును పార్థ చటర్జీ మరో కారులో వెంబడించే వారని, కొంత దూరం వెళ్లాక ఆయన ఆమె కారులోకి మారి జాయ్ రైడ్‌కు వెళ్లే వారని ఆ అధికారి చెప్పారు. ఈ కార్లన్నీ కూడా 20162019 మధ్య కొనుగోలు చేశారని కూడా ఆ అధికారి చెప్పారు. ఒక కారును పార్థ చటర్జీ ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడని, మిగతా కార్లు కొనుగోలు చేయడానికి సాయం చేశారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News