Sunday, July 7, 2024

ఓఎం చారిటీ గ్రూప్‌పై ఇడి సోదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఇడి దాడులు కలకలం రేపాయి. నిరుపేద పిల్లలకు ఉచిత విద్య, భోజనం పేరుతో సేకరించిన రూ.300 కోట్ల విదేశీ నిధులను అనధికారిక అవసరాలకు మళ్లించినట్లు తెలంగాణకు చెందిన స్వచ్ఛంద సంస్థపై జరిపిన సోదాల్లో తేలిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం తెలిపింది. ఆపరేషన్ మొబిలైజేషన్ (ఓఎం) గ్రూప్ ఆఫ్ చారిటీస్ కు చెందిన 11 చోట్ల జూన్ 21, 22 తేదీల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిం చినట్లు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లాండ్, మలేషియా, నార్వే, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, రొమేనియా, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విదేశీ దాతల నుంచి దళిత, అణగారిన పిల్లలకు ఉచిత విద్య, భోజనం పేరుతో సుమారు రూ. 300 కోట్ల నిధులను ఛారిటీ గ్రూప్, ఇతరులు సేకరించారని రాష్ట్ర పోలీసు సిఐడి ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సిఐడి ఎఫ్‌ఐఆర్ ప్రకారం, ఈ గ్రూప్ నడుపుతున్న 100కి పైగా గుడ్ షెపర్డ్ పాఠశాలల్లో పిల్లలు చదువుతున్నారు.

ఈ నిధులను ఆస్తుల సృష్టి, ఇతర అనధికారిక ప్రయోజనాల కోసం మళ్లించారని ఇడి ఆరోపించింది. విద్యార్థుల స్పాన్సర్షిప్, ట్యూషన్, ఇతర ఫీజులను విద్యార్థుల నుంచి నెలకు రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు వసూలు చేసి, గణనీయమైన నిధులను ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టి ఓఎం గ్రూప్‌నకు చెందిన ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించినట్లు సిఐడి దర్యాప్తులో తేలింది. విద్యాహక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని, కానీ వాటిని సక్రమంగా నమోదు చేయలేదని, ఇతర ఆదాయాలను ఖాతాల పుస్తకాల్లో చాలా తక్కువగా నివేదించారని ఇడి ఆరోపించింది.

తెలంగాణ, గోవా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న ఓఎం గ్రూప్ ఆఫ్ చారిటీస్ నిధులను, గ్రూపు లోని కీలక ఆఫీస్ బేరర్లకు చెందిన పలు స్థిరాస్తుల కోసం దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. చాలా గ్రూపు సంస్థలకు ఎఫ్ సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్లు రెన్యువల్ కాలేదని, వాటిని దాటవేసేందుకు ఎఫ్‌సిఆర్‌ఎరిజిస్టర్డ్ ’ఓఎం బుక్స్ ఫౌండేషన్ ’లో వచ్చిన విదేశీ నిధులను ఇంకా తిరిగి చెల్లించని రుణాలుగా ఇతర గ్రూపు సంస్థలకు మళ్లించారని వెల్లడించింది. గ్రూప్ ఆఫీస్ బేరర్లు గోవాలోని షెల్ సంస్థల్లో కన్సల్టెంట్లుగా పనిచేస్తూ జీతాలు పొందుతున్నారని పేర్కొంది. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు, రహస్య లావాదేవీల రికార్డులు, ఆస్తులు, బినామీ కంపెనీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News