Saturday, February 22, 2025

విద్యపై కేంద్రం గుత్తాధిపత్యమా?

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి జాబితాలోని అంశంపై
పెత్తనం చలాయిస్తామంటే కుదరదు
రాష్ట్రాలు సామంత రాజ్యాలు కాదు
దేశ పురోగతికి అవి జీవనాడీ
ప్రజలకు అవసరమైన విద్య వ్యవస్థలను
రాష్ట్రాలే నిర్మించుకుంటాయి
తిరువనంతపురం జాతీయ ఉన్నత
విద్య సమ్మేళనంలో డిప్యూటీ సిఎం

మన తెలంగాణ / హైదరాబాద్ : విద్య కేంద్రం గుత్తాధిపత్యం కాదని, ఇది ఉమ్మడి జాబితాలో ని అంశం అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం కేరళ రాష్ట్రం తిరువనంతపురం లో జరిగిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. ఆయా రాష్ట్రాలు వారి ప్ర జలకు, వ్యవస్థలకు సరిపోయే విద్యాసంస్థలను, వ్యవస్థలను నిర్మించుకుంటాయని, ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి పోలిక ఉండదన్నారు. స్వ యం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రం అందించలేదన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న అంశాన్ని చర్చలకు పరిమితం కాకుండా అంతా కలిసి నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలు ఒక ఉమ్మడి లక్ష్యంతో ఐక్యమైనప్పుడు కేంద్రం తప్పక వినాలన్నారు. మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరన్న త రహాలో యుజిసి కొత్త నిబంధనలు ఉన్నాయని భట్టి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రా ష్ట్ర ప్రజల పక్షాన సమ్మేళనానికి హాజరైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు.

ఈ చర్చ ఎంతో విలువైనదిగా సీఎం రేవంత్ రెడ్డి భావించి, వారు ఈ సమ్మేళనానికి రాలేకపోయినప్పటికీ రాష్ట్రాలు తమ సొంత విద్య భవిష్యత్తును రూపొందించుకోవడంలో స్వయం ప్రతిపత్తి కోసం బలమైన వాదన వినిపించేందుకు నన్ను పంపారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమ్మేళనం లో యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాల గురించి డిప్యూటీ సీఎం ముందుగా ప్రసంగించి ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్సిటీలకు నిధులు సమకూర్చడంతో పాటు నిర్వహించాలని మాత్రమే కేంద్రం భావిస్తు వైస్ ఛాన్సలర్ల నియామకాల నుంచి అడ్మిషన్ల వరకు కీలకమైన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగిస్తున్నారని వివరించారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు భవనాలు ప్రారంభించే రిబ్బన్ కటింగ్ అధికారానికి మాత్రమే పరిమితమవుతాయన్నారు.

రాష్ట్రాలు దేశ పురోగతికి జీవనాడి : రాష్ట్రాలు కేవలం పరిపాలన విభాగాలుగా మాత్రమే కాదని, అవి ఈ దేశ పురోగతికి జీవనాడి వంటివి అన్నారు. ఒక రాష్ట్ర విద్యార్థుల నాడి, అక్కడ యువత ఆకాంక్షలు, అధిగ మించాల్సిన ప్రత్యేక సవాళ్లు ఆ రాష్ట్రాలకే తెలుస్తాయన్నారు. విద్యావ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేము, దానిని అవసరమైన చోట పెంపొందించాలి, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విధానాలను రూపొందించాన్నారు. సహకారం అంటే బలవంతం కాదు సంప్రదింపులు అని అర్థం, కేంద్రం నిజంగా సహకార సమాఖ్య వాదాన్ని విశ్వసిస్తే చర్చించాలి అన్నారు. రాష్ట్రాలు సహాయాన్ని అడగడం లేదు మన సరైన పాత్రను నొక్కి చెబుతున్నామని అన్నారు. రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వనులు ఎంత దూరమైనా చేరుతాయని చరిత్ర మనకు చెబుతుందని వివరించారు. విద్య అంటే మనసులను తెరవడానికి మార్గం, తలుపులు మూసి వేయడానికి కాదు, స్వయం ప్రతిపత్తి, సుపరిపాలన ద్వారా మనకు మాత్రమే కాదు రాబోయే తరాలకు కూడా తెరిచి ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎం వివరించారు. విద్య , ఆరోగ్య రంగాల్లో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కేంద్రం గౌరవించాలని తెలిపారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పై అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్ వర్సెస్ భారతీయ యూనియన్ కేసులో భారతదేశం ఒక సమాఖ్య రాజ్యాంగ ఉందని పేర్కొన్న అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో ’సమాఖ్య వ్యవస్థ భారత రాజ్యాంగంలోని ప్రామాణిక లక్షణం అని పేర్కొన్న సందర్భాన్ని డిప్యూటీ సీఎం సమ్మేళనంలో ఉదహరించారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం, సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వైస్ ఛాన్సలర్ల అర్హత ప్రమాణాలను మార్చడం ఆందోళనకర అంశం అన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేయడం మూలంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం, సెర్చ్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వైస్ ఛాన్స్‌లర్ల అర్హత ప్రమాణాలను మార్చడం ఆందోళనకర అంశమన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష తప్పనిసరి చేయడం మూలంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

నిజమైన సమాఖ్య ఆత్మకు రూపం ఇవ్వాలి : భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కలిసి నిజమైన సమాఖ్య ఆత్మకు రూపం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తదుపరి సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తద్వారా రాష్ట్రాల తరపున కార్యాచరణ ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంటుందని తెలిపారు. భారత దేశ ప్రజాస్వామిక లక్షణమే వైవిధ్యం అని, ఈ ప్రాథమిక లక్షణాన్ని దెబ్బతీయకూడదన్నారు. సరైన మార్గాన్ని ఎంచుకునే అవకాశం రాష్ట్రాలకు ఉందని, సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సమ్మేళనం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.ఈ సమ్మేళనంలో కేరళ సీఎం. పినరయీ విజయన్, కేరళ ఉన్నత విద్య శాఖ మంత్రి ఆర్. బిందు, కర్ణాటక మంత్రి ఎం.సీ. సుధాకర్ అవారే, తమిళనాడు నుంచి తిరు గోవి చేజియాన్, పంజాబ్ నుండి సర్దార్ హరోజ్ సింగ్ తోపాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News