Friday, September 13, 2024

ఆస్తులు పంచుకున్నారు..అనాథగా మిగిల్చారు

- Advertisement -
- Advertisement -

ఓ కన్నతల్లి కన్నీటి ‘వ్యథ’ ఇది. ఆస్తిని పంచుకున్న కన్నకొడుకులు ఆ తల్లిని అనాథను చేసి వీధుల పాల్జేశారు. బుక్కెడన్నం పెట్టకుండా మాడుస్తున్నారు. పూరిగుడిసెలో ఉంటూ తలదాచుకుంటున్న ఓ వృద్ధురాలు తన పిల్లలు పట్టించుకోవడం లేదంటూ పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది. తన కొడుకులు బుక్కెడంత అన్నం కూడా పెట్టడం లేదంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరుకు చెందిన నరసవ్వ తిమ్మాపూర్ పోలీసులను ఆశ్రయించింది. నరసవ్వకు పుట్టిన నలుగురు కుమారులను పెంచి పోషించి ప్రయోజకులను చేస్తే ఆస్తిపాస్తులను పంచుకున్నారే కానీ తన కష్టసుఖాలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది. భర్త మరణాంతరం నుంచి ఒంటరిగా ఉంటున్న నరసవ్వ నలుగురు కుమారులు ఉన్న అనాధగా మారిన పరిస్థితి ఏర్పడిందంటూ తన దీన పరిస్థితిని పోలీసులకు విన్న వించుకుంది.

అయితే అలుగునూరు గ్రామంలోని ఓ పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్న నరసవ్వకు బుక్కెడంత అన్నం కూడా పెట్టడం లేదం టూ పోలీసులను ఆశ్రయించింది. తనపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న తన కుమారులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిం దిగా నరసవ్వ పోలీసులను కోరుతోంది. అయితే తల్లిపై వ్యవహరి స్తున్న తీరుపై తన కుమారులతో మాట్లాడి నచ్చచెప్పుతామని ఎల్‌ఎండి కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చేరాలు నరసవ్వ కు హామీ ఇచ్చారు. ఏది ఏమైనాప్పటికీ సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా పిల్లలు తమ తల్లిదండ్రులపై చూపిస్తున్న వివక్ష మాత్రం మారడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా వీరి తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదు. వృద్ధాప్య సమయంలో తల్లిదండ్రులను చూసుకోనట్ల యితే సిటిజన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి వృద్ధురాలు నరసవ్వకు పోలీసులు ఏ విధమైన న్యాయం చేకూరుస్తారో? చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News