Tuesday, September 17, 2024

చైనాలో భారీ వర్షాలు..11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

చైనాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి పలు ప్రాంతాలు నీట మునిగాయి.ఆగ్నేయ చైనాలో ఒక ఇల్లు కూలి 11 మంది మృతి చెందారు. ఈశాన్య చైనాలో దాదాపు 27,000 మందిని ఖాళీ చేయించి వేరే చోటికి తరలించారు. వందలాది ఫ్యాక్టరీలను ప్రభుత్వం మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ఫిలిప్పీన్స్‌లో కూడా తుపాన్ విధ్వంసం సృష్టించింది. ఫిలిప్పీన్స్‌లో వర్షాల కారణం గానే 34 మంది మృతి చెందారు. తైవాన్ ద్వీపంలో మృతుల సంఖ్య 10 దాటింది. హునాన్ ప్రావిన్స్ లోని హెంగ్‌యాంగ్ నగర పరిధిలో కొండ చరియలు విరిగి పడినట్టు ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News