- Advertisement -
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని వీడియో రూపంలో గురువారం విడుదల చేసింది చిత్రం యూనిట్. ఈ మెలోడి గీతాన్ని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ‘ఏమిటో ఇది వివరించలేనిది… మది ఆగమన్నది తనువాగనన్నది’ అంటూ సాగే ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ల గాత్రంలో శ్రావ్యంగా వినిపిస్తోంది ఈ పాట. దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. ఈనెల చివరి వారం నుంచి కొన్ని కీలక సన్నివేశాలు, దుబాయ్లో పాటల చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలవుతుంది.
- Advertisement -