Monday, July 1, 2024

కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. ఆమె విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో ఎనిమిది పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు, మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News