Monday, July 1, 2024

పిసి ఘోష్ కమిషన్ గడువు పెంపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలకు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పిసి ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలతో పిసి ఘోష్ కమిషన్ గడువు పూర్తవుతుంది. కాగా విచారణ కొనసాగుతున్నందున గడువును ఆగస్టు 31 వరకు పొడగించారు.

విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సిఈలు, ఇతర ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల ఆరంభంలో నిర్వహించిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి పిసి. ఘోష్ ఆదేశించారు. దాంతో 60 మంది సీల్డు కవర్లలో గురువారం అఫిడవిట్లను దాఖలు చేసినట్లు తెలిసింది.

Kaleshwaram

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News