Sunday, February 23, 2025

ఏనుగు దాడిలో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా , చింతలమానేపల్లి మండలంలోని బూరేపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం నుండి బూరేపల్లి గ్రా మ శివారులోని పంట పొలాల్లోకి బుధవారం సాయంత్రం వచ్చింది. ఈ క్రమంలోనే బూరేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్ (50) అనే రైతు తోటలో పనిచేస్తుండగా ఏనుగు కనిపించడంతో దానిని వెళగొట్టే క్రమంలో ఒక్కసారిగా అతనిపై దాడి చేసి చంపింది. వెంటనే గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని ఏనుగును మహారాష్ట్ర వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటిసారిగా ఏనుగు తమ పంట పొలాల్లోకి రావడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News