Saturday, February 22, 2025

రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ వద్ద రైతు నిరసన

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్ల మీద వృద్ధ రైతు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తనకు రైతు రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్ వద్ద తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం, అంబర్‌పేట్ గ్రామానికి చెందిన తోట యాదగిరి మెట్లపై కూర్చోని ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తనకు రుణమాఫీ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రూ.3 లక్షలకు పైగా క్రాప్‌లోన్ ఉందని, కానీ, రుణమాఫీ కాలేదన్నారు. మరోవైపు తనకు ఎలాంటి పింఛన్, ప్రభుత్వ సాయం, వడ్ల బోనస్ కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News