Tuesday, September 17, 2024

బంతినారుపై రైతులకు అవగాహన

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ వ్యవసాయం : పాలెం వ్యవసా య కళాశాల వారి ఆధ్వర్యంలో బుధవారం గంగారం గ్రామంలోని రైతులకు ఉచితంగా బంతినారు పెంచి ఎరుపు, పసుపు రకాలు అందించడం జరిగింది. బంతి నా రును సూడోమోనాస్ శిలిధ్రం పొడిని నీటిలో కలిపి దానిలో ముంచి నాటించడం జరిగింది.

సుడోమోనాస్ ద్రావణంలో నారువేర్లను ముంచి నాటించడం జరిగిం ది. దీని వల్ల వేరు ద్వారా, నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చని, అంతే కాకుండా పత్తి, బెండ, మిరప పంటలను సందర్శించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం వ్యవసాయ కళాశాల అసొసియేట్ డీన్ డాక్టర్ బి. పుష్పావతి బంతి నారును ఉచితంగా రైతులు నార్య, ఆంజనేయులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్. సుమలత, భానుశ్రీ, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News