Sunday, September 8, 2024

ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

ముగ్గురు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఇనాం గుడా చెరువులోకి ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చిన వ్యక్తి.. వేగంగా కారును చెరువులోకి తీసుకెళ్లాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నలుగురిని బయటకు తీయటంతో ప్రాణాలతో బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కారులో వచ్చిన వ్యక్తిని బీఎన్ రెడ్డికి చెందిన అశోక్ గా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News