Saturday, February 22, 2025

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఐపిసి సెక్షన్ 153-ఎ (1) (ఎ) కింద దాదర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ద్వేషపూరిత ప్రసంగంపై ఆరోపించిన సంఘటన జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత పోలీసులు రాజా సింగ్‌పై సోమవారం అభియోగాలు మోపారు.

అంతకుముందు మహారాష్ట్రలో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లింలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు సింగ్‌పై కేసు నమోదైంది. స్థానికులు కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మార్చి 10న జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ ముస్లింల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడు. 2026 నాటికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామని పేర్కొన్నాడు. అతని ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News