Sunday, February 23, 2025

రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ డైరీఫామ్ చౌరస్తా వద్ద ఆపార్ట్‌మెంట్ సెల్లార్‌లో మంటలు అంటుకున్నాయి. దీంతో కార్లు, బైకులు మంటలు అంటుకోవడంతో నిమిషాల వ్యవధిలో పూర్తిగా తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు బయటకు రాలేదు. షార్ట్ సర్కూట్ వల్ల జరిగిందా? లేక మరో కోణంలో జరిగిందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News