Monday, April 28, 2025

ఢిల్లీలోని రోహిణి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: ఒక రోగి మృతి

- Advertisement -
- Advertisement -

Rohini Hospital

ఢిల్లీ:  రోహిణి ప్రాంతంలోని బ్రహ్మ శక్తి ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో శనివారం ఉదయం మంటలు చెలరేగగా, ఒక రోగి చనిపోయి ఉంటాడని అధికారులు తెలిపారు. పిటిఐ నివేదించిన ప్రకారం, ఉదయం 5 గంటలకు ఆసుపత్రిలోని మూడవ అంతస్తులో మంటల గురించి సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్  పిటిఐ వార్తా సంస్థతో  మాట్లాడుతూ మంటలను ఆర్పడానికి తొమ్మిది అగ్నిమాపక శకటాలు ఆసుపత్రికి తరలించబడ్డాయని, వెంటిలేటర్‌పై ఉన్న ఒక రోగి మినహా మిగతా రోగులందరూ రక్షించబడ్డారని,  మంటల్లో ఆ రోగి మరణించినట్లు అనుమానిస్తున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News