Sunday, September 8, 2024

బస్సులో చెలరేగిన మంటలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గురుగావ్‌లో బుధవారం రాత్రి ఓ డబుల్‌డెక్కర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పన్నెండు మందికి పైగా గాయపడ్డారు. జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లుతుండగా బస్సు గురుగావ్ చేరుతుండగా మంటలు వ్యాపించాయని ఎసిపి వరుణ్ దహియా విలేకరులకు తెలిపారు. బస్సులో మంటల విషయం తెలియగానే అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. బస్సులో నుంచి రెండు భౌతికకాయాలను వెలికితీశారు. గాయపడిన పలువురిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మంటలకు కారణాలు ఏమిటనేది వెంటనే వెల్లడికాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News