Sunday, April 27, 2025

కారు మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లోని కారు మెకానిక్ షెడ్ లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటానగర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు మెకానిక్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News