Thursday, July 4, 2024

హైదరాబాద్ కు తిరిగొచ్చిన తొలి హాజీల బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హజ్ చేయడానికి హైదరాబాద్ నుంచి వెళ్లిన హాజీల తొలి బృందం నేడు(ఆదివారం) సౌదీ అరేబియా నుంచి నగరానికి తిరిగొచ్చింది. రాష్ట్ర హజ్ కమిటీ ప్రతినిధులు వారిని రిసీవ్ చేసుకున్నారు.

హైదరాబాద్ నుంచి 7900 మంది, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 11000 మంది హజ్ కు వెళ్లారు. మక్కాలో ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉండడం వల్ల 98 మంది భారతీయ హాజీలు చనిపోయారు. వారిలో ఆరుగురు తెలంగాణకు చెందిన వారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News