Friday, April 25, 2025

తమిళనాడులో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తిరుచ్చిజిల్లా మనపరై లోని వాయంబటి వద్ద జాతీయ రహదారిపై ఎస్‌టీస్ బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారని ఎస్పీ సుజీత్ కుమార్ తెలిపారు. కారు టైరు పేలడంతో అదుపు తప్పి బస్సును కారు ఢీకొట్టగా, ఆర్టీసి బస్సు డ్రైవర్ కారును తప్పించేందకు ప్రయత్నించారు. ఈ సమయంలో బస్సు కూడా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురు ప్రయాణికులకు గాయాలు తగిలాయి. వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News