Sunday, February 23, 2025

ఎల్ బి నగర్ లో కుప్పకూలిన ఫ్లైఓవర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎల్ బినగర్ సాగర్ రింగు రోడ్డు లో ప్రమాదం చోటు చేసుకుంది. బైరామల్ గూడ ప్లై ఓవర్ ర్యాంప్ బుధవారం తెల్లవారు జామున కుప్పకూలింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కూలీలు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రిస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గాయపడ్డ కూలీలంతా బిహర్, యూపికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News