- Advertisement -
హైదరాబాద్: సైక్లింగ్ చేస్తూ ఓ విదేశీయుడు మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని గండిపేట్లో జరిగింది. పాల్ అనే విదేశీయుడు గచ్చిబౌలిలోని లగ్జరీ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం సైక్లింగ్ చేస్తూ కిందపడిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. హార్ట్ ఎటాక్తో చనిపోయి ఉంటాడని వైద్యులు అభిప్రాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- Advertisement -