Sunday, September 8, 2024

కొవిడ్‌తో నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 605 కొవిడ్ కేసులు బయటపడగా, క్రియాశీల కేసులు 4,002 కు చేరాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, త్రిపురలో మరొకరు మొత్తం నలుగురు కొవిడ్‌తో మృతి చెందారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,44,81,341కి పెరిగింది. రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 220.67 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. డిసెంబర్ 31న 5481 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం క్రియాశీల కేసుల్లో 92 శాతం మంది ఐసొలేషన్ ద్వారానే కోలుకున్నారు. 681కి పెరిగిన జెఎన్.1 కేసులు కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్.1 కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి.

జనవరి 7 వరకు మొత్తం 12 రాష్ట్రాల్లో 682 జెఎన్.1 కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. కర్నాటకలో 199, కేరళలో 148,మహారాష్ట్రలో 139,గోవాలో 47,గుజరాత్‌లో 36,ఆంధ్రప్రదేశ్‌లో 30,రాజస్థాన్‌లో 30,తమిళనాడులో 30,ఢిల్లీలో 21,ఒడిశాలో3,తెలంగాణలో 2,హర్యానాలో 1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందవలసిన పనిలేదని, బాధితుల్లో అత్యధికశాతం ఇంటివద్ద చికిత్సతో కోలుకుంటున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పటికప్పుడు ఈ కేసులను పర్యవేక్షించాలని, ఇన్‌ఫ్లుయెంజా, శ్వాసతీసుకోవడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స చేయాలని, జిల్లాల వారీగా కేసుల వివరాలు అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరించింది.

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ నాంజేగౌడ కార్యాలయాలపై ఈడీ దాడులు
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ కెవై నాంజేగౌడ కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం దాడులు చేసింది. మనీల్యాండరింగ్
కేసులో దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. గౌడకు చెందిన మాలూర్, కోలార్ ఏరియాల్లోని కార్యాలయాలపై దాడులు చేశారు. కోలార్‌చిక్కబల్లాపూర్ జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న నాంజేగౌడ ఆ యూనియన్‌లో సిబ్బంది నియామకంలో అక్రమాలు జరిగాయని స్థానిక పోలీస్‌లకు అందిన ఫిర్యాదుల ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. కోలార్ మిల్క్ కో ఆపరేటివ్ కార్యాలయం , ప్లాంట్ లో సోదాలు జరిగాయి. కర్ణాటక రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పాల ఉత్పత్తి సంఘం కోలార్ జిల్లా కోఆపరేటివ్ సంస్థ. ఈ సొసైటీ పరిధిలో 11 రెవెన్యూ తాలూకాలు, 2919 గ్రామాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News