- Advertisement -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బ్రిడ్జి గోడను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఎపిలోని అనంతపురం జిల్లా హిందూపురం వాసులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులు నాగభూషణ్, నాగరాజు, మురళి, సోమగా గర్తించారు. కర్ణాటక యాద్గిర్ జిల్లా షహార్ పూర్ సంతలో గొర్రెలను కొనుగోలు చేసేందుకు వెళ్లారు. రాయ్ చూర్ జిల్లా గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమర్పురాలో వీరు ప్రయాణిస్తున్న వాహనం బ్రిడ్జిని ఢీకొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. మృతుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటన తో బ్రిడ్జిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.
- Advertisement -