Thursday, September 19, 2024

ఒకే కుటుంబంలో నలుగురు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

Four members of a family died after house caught fire

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ బందా జిల్లాలోని దుబన్ కా పూర్వా గ్రామంలో ఓ ఇంట్లో మంటలు చెలరేరి ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన  నలుగురు సజీవదహనం అయినట్టు  పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం సంగీత యాదవ్ (28) ఇంట్లో నుంచి పొగ రావడాన్ని గమనించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో సంగీత యాదవ్, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు చనిపోయినట్లు గుర్తించామని ఎఎస్పి మహేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్, పోలీసు అధికారులు ఆ స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి పంపించామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని ఏఎస్పీ తెలిపారు. ఇంట్లో మంటలు ఎలా చెలరేగాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Four members of a family died after house caught fire
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News