Friday, September 20, 2024

స్థలం జిహెచ్ఎంసిది.. అమ్మి సొమ్ము చేసుకుంది జూబ్లీహిల్స్ సొసైటి

- Advertisement -
- Advertisement -

GHMC Land Sold by Jubilee Hills Society

 

హైదరాబాద్ : జిహెచ్ఎంసికి చెందిన కోట్ల రూపాయల స్థలాన్ని రాత్రికి రాత్రి అమ్మివేసింది జూబ్లీహిల్స్ సొసైటి. స్థలం తమదని జిహెచ్ఎంసి నెత్తి నోరు కొట్టుకున్న వాళ్ళు మాత్రం ఊరుకోలేదు. స్థలం తమదని ప్రొడక్షన్ ను కూడా జిహెచ్ఎంసి అధికారులు పోలీసులను అడిగారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా మూడు వందల యాభై గజాల స్థలాన్ని సురేష్ బాబు అనే వ్యక్తికి అమ్మేశారు. కోట్ల రూపాయలను జేబులో వేసుకున్నారు. చివరకు తాను మోసపోయానని సురేష్ బాబు జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు జూబ్లీహిల్స్ అధ్యక్షుడుతో పాటు మరొకరి పైన కేసు నమోదు చేశారు. దీనిపైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తమ స్థలం కబ్జాకు గురైదంటు జిహెచ్ఎంసి అధికారులు కూడా పిర్యాదు చేయబోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News