- Advertisement -
రాయ్పూర్: 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారయత్నానికి ప్రయత్నిస్తుండగా ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్టుగా ఆరోఫణలు వస్తున్న సంఘటన ఛత్తీస్గఢ్లోని ముంగేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బబ్లూ భాస్కర్ (30) అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తుండగా ప్రతిఘటించింది. దీంతో అతడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేస్తు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసింది. స్థానికులు మంటలను ఆర్పేసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిపై ఐపిసి 302, 506, 354 సెక్షన్లతో పాటు పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -