సిద్దిపేట : తనను పెండ్లి చేసుకొని కాపురం చేయడానికి నిరాకరించడంతో ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగిన సంఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం తోర్నాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కూటిగల్కు చెందిన బోయిని కవిత గత ఏడాది కాలంగా మండలంలోని తోర్నాల గ్రామానికి చెందిన బింగి శ్రీనివాస్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
ఈ నెల 20న కూటిగల్ గ్రామ శివారులో కవిత మెడలో శ్రీనివాస్ తాళి కట్టాడు. ఈ క్రమంలో అత్తగారింటికి వెళ్లిన కవితను శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో శ్రీనివాస్పై ఈ నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ మంగళవారం ఉదయం శ్రీనివాస్ ఇంటి ముందు కూర్చోని కవిత మౌనదీక్ష చేపట్టింది. తన భర్త తనను భార్యగా అంగీకరించే వరకు దీక్ష విరమించేది లేదని చెప్పింది. దీంతో స్థానిక పోలీసులు జోక్యం చేసుకొని కవిత, శ్రీనివాస్లను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ చేపట్టారు.